- చంద్రబాబు పాలనపై కాకాణి ధ్వజం
ఐదు నెలల చంద్రబాబునాయుడు పాలనపై మాజీ మంత్రి కాకాణి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నెల్లూరు డైకస్ రోడ్డులోని ఆయన క్యాంప్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. లా అండ్ ఆర్డర్డ్ లో ఫెయిల్ అయ్యావ్ అని మండిపడ్డారు. నిత్యావసరాలు ధరలు పెంచేయ్యడంతో సామాన్యులు ఇబ్బంది పడుతున్నారని ఆరోపించారు. జగన్మోహన్రెడ్డిని ఎదుర్కొలేకనే జగన్ కుటుంబం మీద బురద చళ్ళుతున్నారని విమర్శించారు. ఫేక్ న్యూస్ ప్రచారం చేయడంలో నారా లోకేష్ దిట్ట అని.. జగన్ కుటుంబం గురించి నీచంగా ప్రచారం చేస్తుండడం సిగ్గుచేటన్నారు.