- మున్సిపల్ కార్మికులకు పెండింగ్ వేతనాలు చెల్లించండి
తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ పారిశుధ్య కార్మికులు రోడ్డెక్కారు. గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదంటూ మున్సిపల్ యూనియన్ నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. వర్షా కాలంలో పారిశుధ్య కార్మికులకు ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు, సామాగ్రీని ఇవ్వాలని చాపల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. న్యాయమైన కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుంటే ప్రజా ఉద్యమానికి సిద్దమవుతానని చాపల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.