న‌వదంపతుల కిడ్నాప్ కలకలం…

  • రాజాని గుర్తించిన పోలీసులు
  • పెంచ‌ల‌మ్మ కోసం గాలింపు
  • వెంక‌ట‌గిరిలో ఘ‌ట‌న

ఉమ్మడి నెల్లూరు జిల్లాలో నవదంపతుల కిడ్నాప్ కలకలం రేపింది. వెంకటగిరి మండలం సీసీ కండ్రిగకు చెందిన వెల్లూరు రాజా(23), ఆయన భార్య పెంచలమ్మ(20) రెండు రోజుల క్రితం దీపావళి పండగకు చిట్వేల్ మండలంలోని అత్తగారి ఇంటికి బయల్దేరారు. మార్గమధ్యలో వారిని ఎవరో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కిడ్నాప్ చేశారు.

రాపూరు అటవీ ప్రాంతంలో నిన్న రాత్రి రాజాను పోలీసులు గుర్తించారు. పెంచలమ్మ కోసం పోలీసులు, బంధువులు గాలిస్తున్నారు. కుటుంబ స‌భ్యుల ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివ‌రాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *