తుమ్మలపెంటలో 2.0 దీపం ప్రారంభం

  • కావలి నియోజకవర్గంలో 38 వేలమంది లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు
  • ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక దీపం పథకం అన్న ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి

నెల్లూరు జిల్లా కావలి మండలం తుమ్మలపెంటలో దీపం 2.0 ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కు టీడీపి శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ దీపం పథకం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మానస పుత్రిక అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ఇచ్చిన మాటమేరకు
ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీకీ శ్రీకారం చుట్టారన్నారు.

కావలి నియోజకవర్గంలో 38 వేల మంది పేదలకు దీపం పథకం వరం కాబోతున్నట్లు చెప్పారు. కావలి మండలం తహశీల్దారు శ్రావణ్ కుమార్,పథకం అమలు తీరు, లబ్ధి ఉద్దేశ్యాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కావలి రూరల్ మండల అధ్యక్షుడు ఆవులు రామకృష్ణ, రూరల్ మండల ప్రధాన కార్యదర్శి ఉప్పాల వెంకట్రావు, ఆర్డీవో వంశీకృష్ణ, ఎంపీడీవో శ్రీదేవి, ఇరిగేషన్ ఏఈ హరీష్, ఏ పి ఎం కృష్ణారావు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *