- జీజీహెచ్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే కారణం
- ఏ రోగిని ఆసుపత్రిలో పట్టించుకోవడం లేదు
- జిల్లా కలెక్టర్ స్పందించి చర్యలు తీసుకోవాలి
- తల్లి మృతిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన కొడుకు
నెల్లూరు జీజీహెచ్ వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే….బుజ బుజ నెల్లూరు భగత్ సింగ్ కాలనీకి చెందిన రాచూరి లక్ష్మి మృతి చెందినట్లు ఆమె కుమారుడు రాచూరి శేషవ రావు ఆరోపించారు. ఈ మేరకు ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి…తన తల్లి మృతికి కారణమైన పెద్దాసుపత్రిలోని వైద్యులు, సిబ్బందిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని దర్గామిట్ట పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారిని విధుల నుంచి సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ పోలీసులకు వినతి పత్రం అందచేశారు.
ఈ సందర్భంగా కుమారుడు శేషవరావు, కుమార్తెలు మీడియాతో మాట్లాడుతూ… మా అమ్మకి ట్రీట్మెంట్ చేయకపోవడంతోనే చనిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం సింహపురి చైతన్య వేదిక నాయకులు బాబీ భగత్, అమృత్లు మాట్లాడుతూ… కలెక్టర్, సీఐలు స్పందించి పూర్తి విచారణ జరిపి లక్ష్మీ మృతికి కారకులైన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే పోరాడుతామని హెచ్చరించారు.