- తాళ్లపూడి సాయిబాబా మందిరంలో అన్నదానం
- భిక్ష స్వీకరించాలని కోరిన నిర్వాహకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి
కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భవానీ మాల ధారణ చేసే భక్తుల సౌకర్యార్థం నెల రోజుల పాటు ప్రతి రోజు మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా…. ముత్తుకూరు మండలం…తాళ్ళపూడిలోని శ్రీ షిర్డీసాయి బాబా మందిరం ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో మందిర ధర్మకర్త, వైసీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి అయ్యప్పస్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
కార్తీక మాసం మొదటి రోజు అయిన శనివారం నుంచి కార్తీక మాసం చివరి రోజు వరకు స్వాములందరికి ప్రతీ రోజు మధ్యాహ్నం భోజన వసతి ఏర్పాటు చేశామని… దీక్షలో ఉన్న స్వాములు అందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని భిక్ష స్వీకరించాలని అన్నదాన నిర్వాహకులు మెట్టా కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు అయ్యప్ప స్వాములు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.