- రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి
- రూరల్ 36వ డివిజన్లో దీపం – 2 పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
ఎన్నికలవేళ చెప్పిన హామీలను ఒక్కొక్కటిగా చంద్రబాబు నాయుడు నెరవేరుస్తున్నారని… రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి తెలిపారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 36వ డివిజన్, బట్వాడిపాలెం సెంటర్లో ఆయన ఆర్డీవో నాగ సంతోష అనూష, టీడీపీ నాయకులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులందరికి ఎమ్మెల్యే ఉచిత గ్యాస్ సిలెండర్లను పంపిణీ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ… గత వై.ఎస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అనాలోచిత నిర్ణయాల వల్ల ఆర్థికంగా నష్టపోయిన రాష్ట్రాన్ని నేడు ముఖ్యమంత్రి చంద్రబాబు గాడిన పెడుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పిండి సురేష్, తాటి వెంకటేశ్వర్లు, క్లస్టర్ ఇంఛార్జులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.