15వేలుకు మొదలై రూ. 10.12వేలకు ముగిసిన పాట
పంచాయతీ ఆదాయ వనరుల కోసం ఉదయగిరి గ్రామపంచాయతీలో వివిధ రకాల వేలం పాటలు జరిగాయి. సర్పంచ్ పావులూరి సామ్రాజ్యం, ఉప సర్పంచ్ షేక్. ముర్తుజా హుస్సేన్ పంచాయతీ కార్యదర్శి కరిముల్లాలు వేలం పాటలు నిర్వహించారు. రూ. 15వేల నుంచి మొదలైన వేలం పాట రూ. పది లక్షల 12 వేలకు ముగిసింది. పదిలక్షల 12 వేల రూపాయలకు షేక్ ఖలీద్ దక్కించుకున్నట్లు పంచాయతీ ఈవో,షేక్ కరిముల్లా తెలిపారు. అయితే ప్రతిసారి లక్షా 10వేలు పాడుతున్న వేలం పాటలు అనూహ్యంగా ఈ సారి 10 లక్షల 12వేలకి వెళ్లడం కొసమెరుపు.