- సూపర్ సిక్స్ అమలుతో విపక్షం ఆరోపణలకు చెక్
- కోవూరులో ఉచిత సిలెండర్ల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే వేమిరెడ్డి
- అమరజీవి పొట్టి శ్రీరాములుకి ఘన నివాళులు
అక్క చెల్లెమ్మలకు ఉచిత సిలెండర్ల యివ్వడం ద్వారా చంద్రబాబు నాయుడు మహిళా సాధికారతకు శ్రీకారం చుట్టారన్నారని ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా కోవూరు మండల కార్యాలయ ఆవరణలో ఉచిత సిలెండర్ల పంపిణి కార్యక్రమాన్ని ఆమె లాంచనంగా ప్రారంభించారు. ముందుగా ప్రాణ త్యాగం చేసి తెలుగువారి కోసం ప్రత్యేక రాష్టం సాధించిన అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి నివాళులు అర్పించారు.
ఎమ్మెల్యే ప్రశాంతి మాట్లాడుతూ… రాష్ట ఖజానా పై 2 వేల 684 కోట్ల రూపాయల భారం పడుతున్నా.. పేద మధ్య తరగతి వర్గాలకు ఆర్ధికంగా అండగా నిలవాలన్న ఉద్దేశంతోనే చంద్రబాబు నాయుడు సూపర్ సిక్స్ హామీలను అమలు చేస్తున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్టంలో దాదాపు కోటి 55 లక్షల మంది ఉచిత గ్యాస్ సిలెండర్ల పధకం ద్వారా లబ్ది పొందుతారన్నారు.
ఈ కార్యక్రమంలో కోవూరు తహసీల్దార్ నిర్మలానంద బా,ఎంపిడిఓ శ్రీహరి రెడ్డి, టిడిపి జిల్లా కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వర్లు రెడ్డి, కోవూరు టిడిపి అధ్యక్షులు మల్లారెడ్డి, ఎంపిపి తుమ్మల పార్వతి, లేగుంటపాడు సర్పంచ్ జెట్టి రాజగోపాల్ రెడ్డి, అశోక్ రెడ్డి, చెరుకూరు మహేష్, తదితరులు పాల్గొన్నారు