విశ్వ‌సాయి డా.ఎస్ఆర్‌కేలో హ‌లోవీన్ డే

నెల్లూరు మాగుంట లేఅవుట్‌లో ఉన్న విశ్వ‌సాయి డాక్ట‌ర్ ఎస్ఆర్‌కే స్కూల్లో… హ‌లోవీన్ డే ఘ‌నంగా జ‌రిగింది. హ‌లోవీన్ డేని పుర‌స్క‌రించుకొని…పాఠ‌శాల‌లోని చిన్నారులు విచిత్ర వేష‌ధార‌ణ‌ల‌తో రంజింప చేస్తూ…వ‌చ్చిన సంద‌ర్శ‌కుల‌ను భ‌య పెడుతూ…ఎంతో ఆహ్లాదంగా పాల్గొన్నారు. చిన్నారుల‌లో భ‌యాన్ని తొల‌గించ‌డం, రుతువుల మార్పిడికి నిద‌ర్శ‌నంగానే ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం జ‌రిగింద‌ని స్కూల్ ప్రిన్సిపాల్ ర‌ఘురామ్ తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎన్‌3 న్యూస్‌తో మాట్లాడారు. త‌మ విద్యా సంస్థ‌లో విద్యార్థుల‌కి చ‌దువుతోపాటు ఇంట‌ర్న‌ల్ స్కిల్స్ , అంత‌ర్గ‌త నైపుణ్యాల‌ను…

Read More

కార్తీక మాసం చివరి వరకు స్వాములకు భిక్ష…

కార్తీక మాసం సందర్భంగా అయ్యప్ప స్వాములు, శివ స్వాములు, భవానీ మాల ధారణ చేసే భక్తుల సౌకర్యార్థం నెల రోజుల పాటు ప్రతి రోజు మధ్యాహ్నం భిక్ష ఏర్పాటు చేస్తున్నట్లు నిర్వాహకులు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా…. ముత్తుకూరు మండలం…తాళ్ళపూడిలోని శ్రీ షిర్డీసాయి బాబా మందిరం ప్రాంగణంలోని కళ్యాణ మండపంలో మందిర ధర్మకర్త, వైసీపీ మండల అధ్యక్షుడు మెట్టా విష్ణువర్ధన్ రెడ్డి అయ్యప్పస్వామి వారికి ప్రత్యేక పూజలు చేసి అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్తీక…

Read More

ట్రీట్మెంట్ చేయ‌క‌పోవ‌డంతోనే మృతి..

నెల్లూరు జీజీహెచ్ వైద్యులు, సిబ్బంది నిర్ల‌క్ష్యం కార‌ణంగానే….బుజ బుజ నెల్లూరు భ‌గ‌త్ సింగ్ కాల‌నీకి చెందిన రాచూరి ల‌క్ష్మి మృతి చెందిన‌ట్లు ఆమె కుమారుడు రాచూరి శేషవ రావు ఆరోపించారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి…త‌న త‌ల్లి మృతికి కార‌ణ‌మైన పెద్దాసుప‌త్రిలోని వైద్యులు, సిబ్బందిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ద‌ర్గామిట్ట పోలీసుస్టేష‌న్‌లో ఫిర్యాదు చేశారు. వారిని విధుల నుంచి స‌స్పెండ్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ పోలీసుల‌కు విన‌తి ప‌త్రం అంద‌చేశారు. ఈ సంద‌ర్భంగా…

Read More

ప్ర‌యాణికుడిని కొట్టిన డ్రైవ‌ర్‌

ఓ ప్ర‌యాణికుడిపై బ‌స్సు డ్రైవ‌ర్ దాడికి పాల్ప‌డిన ఘ‌ట‌న‌… నెల్లూరు జిల్లా కావ‌లిలో శుక్ర‌వారం అర్ధ‌రాత్రి చోటు చేసుకుంది. లాజర్ అనే ప్రయాణికుడు మద్యం తాగి బస్సు ఎక్కే ప్రయత్నం చేశాడు. దీంతో డ్రైవ‌ర్ అత‌న్ని అడ్డుకున్నాడు. తాగి బస్సు ఎక్కకూడదని చెప్పడంతో వారి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో డ్రైవర్ తనను కొట్టడంతో పన్ను విరిగి నోటి నిండా రక్తస్రావమైందని లాజర్ ఆరోపించారు. ఆయన కుటుంబ సభ్యులు రోడ్డు మీద బైఠాయించారు. పోలీసులు బస్సు…

Read More

సంగంలో మేక‌పాటి జ‌యంతి

నెల్లూరు జిల్లా సంగంలో దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి జయంతి వేడుకలను వైసీపీ నాయకులు ఘనంగా నిర్వహించారు. వైసిపి మండల కన్వీనర్ పులగం శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు సంగం బ్యారేజీ వద్ద ఉన్న గౌతమ్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ నాయకులు రఘునాథరెడ్డి ఆధ్వర్యంలో స్థానిక పి హెచ్ సి లో గౌతమ్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రోగులకు బ్రెడ్లు పంపిణీ చేశారు. గౌతంరెడ్డి చేసిన…

Read More

రైతుల‌కి సాగునీరందించేందుకు చ‌ర్య‌లు

నెల్లూరు జిల్లా సంగం బ్యారేజి వద్ద కుడి వైపు ఉన్న కనుపూరు కాలువలో పూడిక తొలగింపు పనులను సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పరిశీలించారు. పనుల పురోగతి గురించి ఇరిగేషన్ అధికారులతో మాట్లాడారు. పనులు వేగంగా పూర్తి చేసి రైతులకు సాగు నీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రూ.28 కోట్లతో జిల్లాలో 438 పనులు జరగడం చారిత్రాత్మకమని అన్నారు. ఈ ప్రభుత్వ పని తీరు, పారదర్శకతకు ఇది నిదర్శనమని…

Read More

సంగంలో పొలం పిలుస్తోంది…

నెల్లూరు జిల్లా సంగంలోని స్థానిక ఆంజనేయస్వామి గుడి ఆవరణలో వ్యవసాయాధికారి శ్రీహరి, ఏ డీ ఏ మారుతీ దేవిలు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా రైతులతో సమావేశం నిర్వహించి వారికి పలు సూచనలు, సల‌హాలు చేశారు. నీటి యాజమాన్య పద్ధతుల గురించి వారికి వివరించారు. అదే విధంగా రబీ సీజన్లో పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు. రైతులు తప్పనిసరిగా వ్యవసాయ శాఖ సిబ్బంది చెప్పిన సలహాలు సూచనలు పాటించాలని తెలిపారు.

Read More

మ‌ర్రిపాడులో మేక‌పాటి జ‌యంతి వేడుక‌లు

నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలోని మర్రిపాడు వైసీపీ కార్యాలయం, బ్రాహ్మణపల్లి లోని మేకపాటి నివాసంలో దివంగత మాజీ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి 53వ జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి ఉదయగిరి ఆత్మకూరు నియోజకవర్గాలకు చెందిన వైసిపి నాయకులు కార్యకర్తలతో కలిసి మేకపాటి కుటుంబ సభ్యులు నివాళులు అర్పించారు. అనంతరం మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి కేక్ కట్ చేసి కార్యకర్తలకు పంచిపెట్టారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి…

Read More

నాయుడుపేట‌లో వేలం పాట‌

తిరుపతి జిల్లా నాయుడుపేట మండలం విన్నమాల గ్రామంలోని శ్రీకాళహస్తిశ్వర వేణుగోపాలు స్వామి భూములను కౌలుకు దేవాదాయ శాఖ అధికారులు వేలం నిర్వహించారు. సంత్సర కాలానికి 19ఎకరాలను బహిరంగంగా వేలం ద్వారా పలువురు రైతులు దక్కించుకున్నారని ఈవో రవి కృష్ణా తెలిపారు. ఈ వేలం ద్వారా లక్షా యాబైవేల వంద రూపాయలు దేవస్థానానికి ఆదాయం వచ్చిందని ఈవో తెలిపారు.

Read More

నాయుడుపేట‌లో రోడ్డెక్కిన కార్మికులు

తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపల్ పారిశుధ్య కార్మికులు రోడ్డెక్కారు. గత మూడు నెలలుగా వేతనాలు చెల్లించలేదంటూ మున్సిపల్ యూనియన్ నాయకులతో కలిసి ఆందోళనకు దిగారు. వర్షా కాలంలో పారిశుధ్య కార్మికులకు ఇవ్వాల్సిన కనీస సౌకర్యాలు, సామాగ్రీని ఇవ్వాలని చాపల వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. న్యాయమైన కార్మికుల డిమాండ్లను పరిష్కరించకుంటే ప్రజా ఉద్యమానికి సిద్దమవుతాన‌ని చాపల వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Read More