అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఘన నివాళులు
తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో పలు ప్రాంతాలలో తెల్లవారుజాము నుంచి పట్టణ టిడిపి నాయకులు, సచివాలయ ఉద్యోగులు లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పింఛన్లు అందిస్తున్నారు. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే డా.నెలవల విజయశ్రీ చేతుల మీదుగా 15వ వార్డు లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు. అనంతరం స్థానికుల ఆరోపణ మేరకు బండారురాజా వీధి సైడ్ కాలువ దుస్థితి పరిశీలించారు. త్వరలో రోడ్డు ప్రక్రియను మొదలుపడతామని హామీ ఇచ్చారు. ఆంధ్రరాష్ట్ర అవతరణ దినోత్సవం పురస్కరించుకొని శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి వాలంటీర్ సంఘం ఆధ్వర్యంలో కచేరివీధిలో అమరజీవి పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలవేసి జోహార్ పొట్టి శ్రీరాములు అంటూ నినాదాలతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. ఎన్నికల హామీలలో ఒకటైన ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు నేటి నుంచి ప్రారంభమైందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.