రైతులకు సహాయం చేసిన పోలీసులు

  • విద్యుత్ మోటారు దొంగల గుట్టురట్టు
  • 43 మోటార్లు, మూడు బైక్ లు, ఆటో స్వాధీనం
  • వివరాలు వెల్లడించిన నెల్లూరు ASP సౌజన్య

విద్యుత్ మోటర్ల కొనుగోలు చేయాలంటే రైతులకి ఇబ్బంది అని… కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని రైతులకు సహాయం చేసిన కోణంలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని….నెల్లూరు అడిషనల్ ఎస్పీ సౌజన్య చెప్పారు. నెల్లూరు జిల్లా… ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తో కలిసి ASP మీడియాతో మాట్లాడారు….కృష్ణపట్నం సర్కిల్ పరిధిలో గత కొద్దిరోజులుగా వరి పొలాలు, రొయ్యల గుంటల వద్ద విద్యుత్ మోటార్ దొంగతనాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు.

ఈ కేసులు సీరియస్ గా తీసుకున్న నెల్లూరు రూరల్ డిఎస్పీ, కృష్ణపట్నం సర్కిల్ పరిధిలోని ముత్తుకూరు ,కృష్ణపట్నం పోలీస్ స్టేషన్ల సిబ్బంది సహకారం తో కేసులను ఛేదించి దొంగతనాలకు పాల్పడుతున్న ఏడు మందిని అరెస్ట్ చేశారని చెప్పారు. మొత్తం ఎనిమిది లక్షల డెబ్భై వేల రూపాయల విలువ చేసే 43 విద్యుత్ మోటార్లు, దొంగతనాలకు ఉపయోగించిన 3 బైక్లు, ఆటో సీజ్ చేశామని ASP చెప్పారు.

కేసు ఛేదించిన సిబ్బందికి జిల్లా…SP కృష్ణకాంత్ రివార్డులు ప్రకటించారని తెలిపిన ASP….సంబంధిత పోలీస్ సిబ్బందికి రివార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణపట్నం CI రవినాయక్, ముత్తుకూరు SI విశ్వనాథ రెడ్డి, కృష్ణపట్నం SI జెపి శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *