నెల్లూరులో స్పష్టం చేసిన మంత్రి నారాయణ
రానున్న పది, 15 రోజుల్లోనే ఇసుకని రూ. వెయ్యికే అందిస్తామని…రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. నెల్లూరు నగరం 3వ డివిజన్ లో జరిగిన పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన ఉచిత ఇసుక పాలసీపై మీడియాతో మాట్లాడారు. మేము ఇప్పుడు ఇసుక ధరలు తగ్గిస్తే ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని… వైసీపీ నేతలపై ఆయన సెటైర్లు వేశారు. వాళ్లు ఎందుకు ధర్నా చేశారో అర్ధం కాక…ప్రజలే నవ్వుకుంటున్నారన్నారు.