ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీత‌నంగా వ్య‌వ‌హ‌రించాలిలేదంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ్‌

  • తుమ్మ‌గుంట పింఛ‌న్ల పంపిణీలో అధికారుల‌పై మండిప‌డ్డ
  • కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి

నెల్లూరు జిల్లా.. కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. విడ‌వ‌లూరు మండ‌ల పంచాయతీలోని తుమ్మ‌గుంట గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి 5వ పెన్ష‌న్ల‌ను పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి.. అవ్వ‌.. తాతల‌తోపాటు అర్హులైన‌న పెన్ష‌న్ దారుల‌కు ఆమే స్వ‌యంగా పింఛ‌న్లు అందించారు. అంతేకాకుండా.. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. వారి సాద‌కబాధ‌లు అడిగి తెలుసుకున్నారు.

అలాగే స్థానికుల‌తోనూ ఎమ్మెల్యే మాట్లాడారు. స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌లను కొంద‌రు ప్ర‌శాంతిరెడ్డి దృష్టికి తెచ్చారు. ప్ర‌ధానంగా పంచాయ‌తీ అధికారులు, విద్యుత్ ఇత‌ర శాఖ‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను ఆమె దృష్టికి తెచ్చారు. దాంతో ఆయా అధికారుల‌ను అక్క‌డిక‌క్క‌డే క‌డిగిపారేశారు. స‌రైన వ‌స‌తులు లేక‌పోవ‌డంతో వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మీరంతా ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీత‌నంగా వ్య‌వ‌హ‌రించాల‌ని.. లేదంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ ఆమె హెచ్చ‌రించారు.

అనంత‌రం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడారు. ఈ కార్య‌క్ర‌మంలో టీడీపీ నాయ‌కులు, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *