థ్యాంక్యూ సీఎం సార్‌…

  • ఆల‌యాల ట్ర‌స్ట్ బోర్డ్ స‌భ్యుల నియామ‌కాల్లో నాయీ బ్రాహ్మ‌ణులు
  • నాయీబ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు కోసూరి

ఆల‌యాల ట్ర‌స్టు బోర్డు స‌భ్యుల నియామ‌కాల్లో నాయీ బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం నుంచి ఒక‌రికి సముచిత స్థానం కల్పించడం దేశ చ‌రిత్ర‌లోనే అరుదైన గౌర‌వమని న‌గ‌ర నాయీబ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు కోసూరి వెంకట శ్రీనివాస్ తెలిపారు. ఇందుకు నాయీ బ్రాహ్మ‌ణుల త‌ర‌పున సీఎం చంద్ర‌బాబు, దేవాదాయ‌, ధ‌ర్మ‌దాయ శాఖామంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నామ‌న్నారు.

ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు చిత్ర‌ప‌టానికి వారు పాలాభిషేకం చేశారు. అనంత‌రం వెంట శ్రీ‌నివాస్ మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డి కార్య‌క‌ర్త‌ల‌ను గుర్తించే ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో కోసూరి లక్షీ నారాయణ, శ్రీరాములు, సత్యనారాయణ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *