ఫించన్ల పంపిణీలో మంత్రి నారాయణ
ప్రతీ నెలా 1వతేదీనే రాష్ట్రంలో 65 లక్షల మందికే ఫించన్లు అందచేస్తున్న ఘనత సీఎం చంద్రబాబు నాయుడుకే దక్కుతుందని…రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. నెల్లూరు నగరం 3వ డివిజన్ ధీనదయాళ్ నగర్లో నవంబరు 1వతేదీ ఫించన్లు పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్, టీడీపీ జిల్లా అధ్యక్షులు షేక్ అబ్ధుల్ అజీజ్, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, కమిషనర్ సూర్యతేజలతో కలిసి మంత్రి నారాయణ పాల్గొని… లబ్ధిదారులకి ఇంటికెళ్లి ఫించన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. ఏం చేయాలో…ఎలా చేయాలో…నాకు ఒకరు చెపాల్సిన అవసరం లేదని…నేను అధికారులతో, ప్రజాప్రతినిధులతో నిత్యం మాట్లాడుతూనే ఉంటానన్నారు. ప్రభుత్వం ఏదైతే డిసైడ్ చేస్తుందో..దానిని అమలు చేయడమే మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యత అని చెప్పారు.