- మేయర్ స్రవంతి జయవర్ధన్
- నెల్లూరులో అమరజీవికి నివాళులర్పించిన మేయర్
తెలుగు ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన వారు అమరజీవి పొట్టిశ్రీరాములు అని నగర మేయర్ పోట్లూరి స్రవంతి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న పొట్టిశ్రీరాములు గారి విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మేయర్ మీడియాతో మాట్లాడుతూ…ఈ రోజు వారు చేసిన త్యాగాలను, సేవలను స్మరించుకుంటూ వారికీ ఘన నివాళి అర్పించడం జరిగింది అన్నారు. అమరజీవి చూపిన మార్గాన్ని యువత ఆచరించాలని మేయర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో మేయర్ వెంట గిరిజన సంఘం చైర్మన్ బత్తిన శేఖర్, మాజీ అట్రాసిటీ సభ్యులు చౌటురు శ్రీనివాసులు, నాయకులూ సిరాజ్ , షఫీ తదితరులు పాల్గొన్నారు.