థ్యాంక్యూ సీఎం సార్‌…

ఆల‌యాల ట్ర‌స్టు బోర్డు స‌భ్యుల నియామ‌కాల్లో నాయీ బ్రాహ్మ‌ణ సామాజిక వ‌ర్గం నుంచి ఒక‌రికి సముచిత స్థానం కల్పించడం దేశ చ‌రిత్ర‌లోనే అరుదైన గౌర‌వమని న‌గ‌ర నాయీబ్రాహ్మణ సాధికార సమితి అధ్యక్షులు కోసూరి వెంకట శ్రీనివాస్ తెలిపారు. ఇందుకు నాయీ బ్రాహ్మ‌ణుల త‌ర‌పున సీఎం చంద్ర‌బాబు, దేవాదాయ‌, ధ‌ర్మ‌దాయ శాఖామంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డిల‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నామ‌న్నారు. ఈ సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు చిత్ర‌ప‌టానికి వారు పాలాభిషేకం చేశారు. అనంత‌రం వెంట శ్రీ‌నివాస్ మీడియాతో మాట్లాడారు. ఇచ్చిన మాట‌కు…

Read More

అమ‌ర‌జీవి సేవలు చిరస్మరణీయం

శ్రీ పొట్టి శ్రీ‌రాములు అమ‌ర‌జీవికి ఘ‌న నివాళులు నెల్లూరులో 69వ ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సందర్భంగా నెల్లూరు నగరంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి రాజ‌కీయ పార్టీల నాయ‌కులు, మేధావులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. జనసేన పార్టీ నగర అధ్యక్షులు దుగ్గిశెట్టి సుజయ్ బాబు జ‌న‌సైనికుల‌తో క‌లిసి అమ‌ర‌జీవి…

Read More

అమ‌ర‌జీవి చూపిన మార్గాన్ని యువ‌త ఆచ‌రించాలి

తెలుగు ప్రజల కోసం, ఆంధ్ర రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం తృణప్రాయంగా త్యాగం చేసిన వారు అమరజీవి పొట్టిశ్రీరాములు అని న‌గ‌ర మేయ‌ర్ పోట్లూరి స్ర‌వంతి అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా న‌గ‌రంలోని ఆత్మకూరు బస్టాండ్ వద్ద ఉన్న పొట్టిశ్రీరాములు గారి విగ్రహానికి ఆమె పూల‌మాల‌లు వేసి నివాళుల‌ర్పించారు. ఈ సంద‌ర్భంగా మేయ‌ర్ మీడియాతో మాట్లాడుతూ…ఈ రోజు వారు చేసిన త్యాగాలను, సేవలను స్మరించుకుంటూ వారికీ ఘన నివాళి అర్పించడం జరిగింది అన్నారు. అమ‌ర‌జీవి…

Read More

ప్ర‌జ‌ల‌కు జ‌వాబుదారీత‌నంగా వ్య‌వ‌హ‌రించాలిలేదంటే చ‌ర్య‌లు త‌ప్ప‌వ్‌

నెల్లూరు జిల్లా.. కోవూరు నియోజ‌క‌వ‌ర్గం.. విడ‌వ‌లూరు మండ‌ల పంచాయతీలోని తుమ్మ‌గుంట గ్రామంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి 5వ పెన్ష‌న్ల‌ను పంపిణీ చేశారు. ఇంటింటికి వెళ్లి.. అవ్వ‌.. తాతల‌తోపాటు అర్హులైన‌న పెన్ష‌న్ దారుల‌కు ఆమే స్వ‌యంగా పింఛ‌న్లు అందించారు. అంతేకాకుండా.. వారితో ఆప్యాయంగా మాట్లాడారు. వారి సాద‌కబాధ‌లు అడిగి తెలుసుకున్నారు. అలాగే స్థానికుల‌తోనూ ఎమ్మెల్యే మాట్లాడారు. స్థానికంగా ఉన్న స‌మ‌స్య‌లను కొంద‌రు ప్ర‌శాంతిరెడ్డి దృష్టికి తెచ్చారు. ప్ర‌ధానంగా పంచాయ‌తీ అధికారులు, విద్యుత్ ఇత‌ర శాఖ‌ల‌కు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను…

Read More

దీపం-2తో 4,06,552 మందికి ల‌బ్ధి

రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ‌మే ధ్యేయంగా ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబునాయుడు వ్యూహాత్మకంగా సుప‌రిపాల‌న సాగిస్తున్నార‌ని…రాష్ట్ర పుర‌పాల‌క ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ అన్నారు. నెల్లూరు 9వ డివిజ‌న్‌లో ఉచిత గ్యాస్ సిలిండ‌ర్ల పంపిణీ ప‌థ‌కాన్ని మంత్రి అట్ట‌హాసంగా ప్రారంభించారు. కార్య‌క్ర‌మానికి విచ్చేసిన మంత్రికి అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధులు, ప్ర‌జ‌లు ఘ‌నంగా స్వాగ‌తం ప‌లికారు. దీపం 2.0 ప‌థ‌కానికి అర్హులైన వారంద‌రికీ ఉచితంగా సిలిండ‌ర్ల‌ను పంపిణీ చేశారు. గ్యాస్ బండిని జెండా ఊపి ప్రారంభించారు. ల‌బ్ధిపొందిన వారితో పాటు ప్ర‌జాప్ర‌తినిధులు,…

Read More

థ‌ట్ ఈజ్ ప్రశాంతిరెడ్డి

ఊరిని స‌రిగా చూసుకోక‌పోతే.. చెక్ ప‌వ‌ర్ ర‌ద్దు చేస్తాంచౌక‌చ‌ర్ల గ్రామ స‌ర్పంచ్ అళ‌గ‌రి వినోద్‌కుమార్ కు వార్నింగ్‌ ఇచ్చిన కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి

Read More

నాయుడుపేట‌లో తృటిలో త‌ప్పిన ప్ర‌మాదం

బ‌స్‌కు అడ్డుగా వ‌చ్చిన బైక్‌పై వెళుతున్న వ్య‌క్తి బ‌స్‌డ్రైవ‌ర్ అప్ర‌మ‌త్త‌తో యువ‌కుడికి త‌ప్పిన ప్ర‌మాదం తిరుపతి జిల్లా నాయుడుపేట ప‌ట్ట‌ణంలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. డ్రైవర్ అప్రమత్తంతో బైక్ పై వెళ్తున్న యువకుడుకి ప్రమాదం తప్పింది. ఉద్యోగులను విధులకు తీసుకుపోతున్న బస్ కు బైక్ అడ్డు రావడంతో ప్రమాదం జ‌రిగింది. ఈ ప్ర‌మాదంలో బైక్‌పై వెళుతున్న యువకుడికి స్వల్పగాయాలు కావడంతో ట్రినిటీ ఆసుపత్రిలో చికిత్స అందించారు. ప్ర‌మాదం జ‌రిగిన దృశ్యాలు బ‌స్‌లోని…

Read More

రైతులకు సహాయం చేసిన పోలీసులు

విద్యుత్ మోటర్ల కొనుగోలు చేయాలంటే రైతులకి ఇబ్బంది అని… కేసును ఛేదించిన పోలీసు సిబ్బందిని రైతులకు సహాయం చేసిన కోణంలో మనస్ఫూర్తిగా అభినందిస్తున్నామని….నెల్లూరు అడిషనల్ ఎస్పీ సౌజన్య చెప్పారు. నెల్లూరు జిల్లా… ముత్తుకూరు పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రూరల్ డిఎస్పీ ఘట్టమనేని శ్రీనివాసరావు తో కలిసి ASP మీడియాతో మాట్లాడారు….కృష్ణపట్నం సర్కిల్ పరిధిలో గత కొద్దిరోజులుగా వరి పొలాలు, రొయ్యల గుంటల వద్ద విద్యుత్ మోటార్ దొంగతనాలు జరుగుతున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు….

Read More

ప్ర‌మాద‌క‌రంగా హోర్డింగ్‌లు…

భ‌యాందోళ‌న‌లో విద్యార్థులు, ప్ర‌యాణికులు ఉమ్మ‌డి నెల్లూరు జిల్లా బాలాయపల్లి మండలం కేంద్రంలో వివిధ ప్రైవేటు హాస్పిటల్ కు సంబంధించిన ప్రచార హోర్డింగులు ప్ర‌మాద‌క‌రంగా మారాయి. వెంకటగిరి – గూడూరు రోడ్డు మార్గ మధ్యలో బాలాయపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముందు భాగంలో, బాలికల గురుకుల పాఠశాల ప్రాంగణం ముందు ఏర్పాటు చేశారు. ఈ హోర్డింగ్‌ల కార‌ణంగా విద్యార్థులు ,ప్రయాణికులకు అటువైపు వచ్చు వాహనాలు కనబడక చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నార‌ని వాపోయారు. పంచాయ‌తీ అధికారుల అనుమ‌తి…

Read More

పచ్చదనమే లక్ష్యంగా గార్డెన్ వరల్డ్.

న‌వంబ‌ర్ 6వ‌తేదీన నెల్లూరు రూర‌ల్ పొట్టేపాళెంలోని గార్డెన్ వ‌ర‌ల్డ్ మొద‌టి వార్షికోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హిస్తున్నామ‌ని… వ‌ర‌ల్డ్ అధినేత న‌వీన్‌కుమార్‌రెడ్డి, నోవా బ్ల‌డ్ బ్యాంక్ చైర్మ‌న్ డాక్ట‌ర్ మోపూరు భాస్క‌ర్ నాయుడులు తెలిపారు. ఈ సంద‌ర్భంగా వారు గార్డెన్ వ‌ర‌ల్డ్ లో మీడియా స‌మావేశం నిర్వ‌హించి మాట్లాడారు. మొద‌టి వార్షికోత్స‌వం సంద‌ర్భంగా ఈ నెల 1వ‌తేదీ నుంచి ఇండోర్, ఔట్ డోర్ మొక్కలపై 10% నుండి 50% వరకు‌ తగ్గించి అందిస్తామని తెలియజేశారు. పచ్చ తోరణం లక్ష మొక్కలహారం…

Read More