బుచ్చి స‌చివాల‌యం ఖాలీ

బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని సచివాలయం 3 ఖాళీగా దర్శనమిస్తుంది. సచివాలయంలో సిబ్బంది ఎవరు లేకపోవడంతో ప్రజలు పనిపై వెళ్లి వెనక్కి తిరగాల్సిన పరిస్థితి నెలకొంది. ఇటీవల ప్రభుత్వం సర్వే చేపట్టమని ఆదేశాలు జారీ చేసే విషయం తెలిసిందే. అయితే సచివాలయంలో కనీసం ఒక అధికారి కూడా లేకుండా అందరూ వెళ్లిపోవడం ఏమిటని ప్రజల ప్రశ్నిస్తున్నారు. దీనిపై ఉన్నతాధికారులు ప్రత్యేక దృష్టి సారించి.. ప్రజలకు నిరంతరం సచివాలయంలో సిబ్బంది అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

Read More

జగనన్న లే ఔట్ లో వ్యక్తి అనుమానస్పద మృతి

నెల్లూరు జిల్లా కావలి పట్టణ సమీపంలోని ముసునూరు జగనన్న లే ఔట్ లో వ్యక్తి మృతి శుక్రవారం రాత్రి వెలుగు చూసింది. విషయం తెలుసుకున్న కావలి రూరల్ సీఐ రాజేశ్వర రావు హుటాహుటీన సంఘటన ప్రాంతానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు ముసునూరు వద్దనున్న అట్టలప్యాక్టరీలో నివాసం ఉంటున్న శాంతి కుమార్ గా గుర్తించారు. అతని చొక్కా రక్తంతో తడిసి ఉంది.కానీ ఎలాంటి రక్త గాయాలు లేవని, ముక్కులో నుంచి రక్తం వచ్చి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. విషయం…

Read More

మెరిట్ విద్యార్థుల‌కు రూ.100 కోట్ల స్కాల‌ర్‌షిప్స్‌

మెరిట్ విద్యార్ధుల‌ను ప్రోత్స‌హించేందుకు కేఎల్ డీమ్డ్ యూనివ‌ర్సిటీ ఆధ్వ‌ర్యంలో విజ‌య‌వాడ, హైద‌రాబాద్‌, బెంగుళూరు క్యాంప‌స్‌ల‌లో 2024-25 విద్యా సంవ‌త్స‌రానికి సంబంధించిన ఇంజ‌నీరింగ్ కోర్సుల్లో ప్ర‌వేశానికై జాతీయ‌స్ధాయిలో ప్ర‌తిభా ప‌రీక్ష‌ను డిసెంబ‌రు 6 నుండి 13 వ‌ర‌కు నిర్వ‌హిస్తున్న‌ట్లు కెఎల్‌డిమ్డ్ యూనివ‌ర్సిటీ అడ్మిష‌న్స్ విభాగం డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ జె.శ్రీనివాస‌రావు తెలిపారు. శ్రుక్ర‌వారం నెల్లూరులోని శ్రీచైత‌న్య జూనియ‌ర్ క‌ళాశాల ఆవ‌ర‌ణంలో పోటీ ప‌రీక్ష‌కు సంబంధించిన పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ జాతీయ స్టాయిలో జ‌రిగే ఈ ప‌రీక్ష‌లో ప్ర‌తిభావంతులైన…

Read More

శ్రీ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారి ఆల‌యంలో రాహుకాల పూజ‌లు

నెల్లూరులోని శ్రీ రాజ‌రాజేశ్వ‌రి అమ్మ‌వారి దేవ‌స్థానంలో శుక్ర‌వారం కార్తీక మాసంను పుర‌స్క‌రించుకుని రాహుకాల పూజ‌లు నిర్వ‌హించారు. ఈ పూజ‌ల‌కు అధిక సంఖ‌లో భ‌క్తులు పాల్గొన్నారు. సాయంత్రం ప‌ల్ల‌కి సేవ అత్యంత వైభ‌వంగా జ‌రిగింది. అనంత‌రం సాంస్కృతిక కార్య‌క్ర‌మాల్లో భాగంగా కోలాటం కార్య‌క్ర‌మం మహిళ‌లచే నిర్వ‌హించ‌డం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో ఆల‌య ఈవో కోవూరు జ‌నార్థ‌న్‌రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Read More

మాదకద్రవ్యాలతో జీవితాలు నాశనం

జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు రాపూరు ఎస్సై వెంకట్ రాజేష్ ఆధ్వర్యంలో… రాపూరు సివికే ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు విద్యార్థిని విద్యార్థులకు రాపూరు పట్టణ ప్రజలకు విద్యార్థి తల్లిదండ్రులకు మాదక ద్రవ్యాల నియంత్రణపై అవగాహన సదస్సు నిర్వ‌హించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ హనుమంతయ్య, రాపూరు ప్రభుత్వ ఆసుపత్రి డాక్టర్ హరీష్ లు హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఎస్సై వెంకట్ రాజేష్ మాట్లాడుతూ.. కాలేజీ విద్యార్థులు గంజాయి మాదకద్రవ్యాలకు జాగ్రత్తగా…

Read More

మ‌హిళ‌లకు ఇబ్బందిక‌లిగించే మ‌ద్యం షాపు వద్దు

ప్రజలకు ఇబ్బంది కలిగించే చోట మద్యం షాపు ఏర్పాటు చేయకూడదని కలిచేడుగ్రామ మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. గ‌త కొద్ది రోజులుగా ఈ మ‌ద్యం షాపు వ‌ద్దంటూ.. వారంతా రోడ్డెక్కి ఆందోళ‌న చేస్తున్నారు. అయినా ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డంలేదు.. మ‌ద్యం వ్యాపారులు ఇష్టం వ‌చ్చింది చేసుకోండి అంటూ.. ఆ షాపు ప‌నిలో నిమ‌గ్న‌మై .. నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. చివ‌ర‌కు పాల‌కులు, అధికారులు సైతం ఆ గ్రామ ప్ర‌జ‌ల గోడు ప‌ట్టించుకోవ‌డంలేదు. క‌నీసం స‌మాధానం కూడా ఇవ్వ‌డంలేదు. నెల్లూరు జిల్లా…

Read More

ప్ర‌శాంతిరెడ్డికి ప్ర‌జ‌ల మ‌న‌స్సుల్లో చెర‌గ‌ని ముద్ర

ధార్మిక, సేవ కార్య‌క్ర‌మాల్లో వీపీఆర్ వెనుక ఉంటూ మంచి మ‌హిళ‌గా పేరుగా తెచ్చుకున్న ప్ర‌శాంతిరెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన అతి త‌క్కువ కాలంలోనే నియోజ‌క‌వ‌ర్గంలో అన్నీ అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను స‌మ‌ర్థ‌వంతంగా నిర్వ‌హిస్తున్నార‌ని నుడా ఛైర్మ‌న్ కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డి అభిప్రాయం వ్య‌క్తం చేశారు. నెల్లూరు జిల్లా తెలుగుదేశంపార్టీ కార్యాల‌యంలో టిడిపి బీసీ ముదిరాజ్ సాధికార సమితి కన్వీనర్ పి ఎల్ రావు ఆధ్వర్యంలో జ‌రిగిన ఎమ్మెల్యే ప్ర‌శాంతిరెడ్డి పుట్టిన‌రోజు వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ వేడుక‌ల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న…

Read More

మోపూరు భాస్క‌ర్‌నాయుడు సేవ‌లు ప్ర‌శంస‌నీయం

శివాజీ యూత్ ఫౌండేష‌న్ వ్య‌వ‌స్థాప‌కులు.. ర‌క్త‌దాత‌.. ర‌క్తదాన చైత‌న్య‌క‌ర్త డాక్ట‌ర్ మోపూరు భాస్క‌ర్ నాయుడు జ‌న్మ‌దిన వేడుక‌ల‌ను నెల్లూరు న‌గ‌రంలో ని రోట‌రీక్ల‌బ్‌లో ఘ‌నంగా నిర్వ‌హించారు. నోవా బ్ల‌డ్ బ్యాంక్ సౌజ‌న్యంతో భారీ ర‌క్త‌దాన శిబిరం నిర్వ‌హించారు. అలాగే గార్డెన్ వ‌ర‌ల్డ్ వారి సహ‌కారంతో వంద‌లాది మొక్క‌ల‌ను పంపిణీ చేశారు. ఈసంద‌ర్భగా జిల్లాలోని ప్ర‌ముఖులు, రాజ‌కీయ‌నేత‌లు, వైద్యులు, ప్ర‌జాసంఘాల నేత‌లు, ఎన్జీవో సంఘాల ప్ర‌తినిధులు, స్నేహితులు, అభిమానులు పెద్ద ఎత్తున భాస్క‌ర్‌నాయుడుని స‌త్క‌రించి.. కేక్ క‌ట్ చేయించి…..

Read More

డ్రగ్స్ మహమ్మారిని తరిమికొడదాం

సమాజంలో ప్రమాదకరంగా మారిన డ్రగ్స్, గంజాయి మహమ్మారిని తరిమికొడదామని పోలీసు శాఖ ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాల్లో ఎస్సైలు పిలుపునిచ్చారు. శుక్రవారం కలిగిరి, కొండాపురం, లింగ సముద్రం మండలాల్లోని ఆదర్శ పాఠశాలల్లో డ్రగ్స్ రహిత ఆంధ్ర ప్రదేశ్ పేరుతో అవగాహన కార్యక్రమాలు జరిగాయి. కలిగిరిలో ఎస్సై ఉమాశంకర్, కొండాపురంలో వెంకట్రావు, లింగసముద్రంలో ఎస్సై మహబూబ్ సుభానిలు విద్యార్థులను చైతన్య పరిచారు. డ్రగ్స్ కు బానిసలవుతూ వారి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. డ్రగ్స్ అమ్మినా, వినియోగించినా…

Read More

దుకాణాల్లో సీసీ కెమెరాలు త‌ప్ప‌నిస‌రి

దుకాణాల్లో, అపార్ట్‌మెంట్ల‌లో త‌ప్ప‌నిస‌రిగా సీసీ కెమెరాలు అమ‌ర్చుకోవాల‌ని సూళ్లూరుపేట సీఐ ముర‌ళీకృష్ణ సూచించారు. తిరుప‌తి జిల్లా సూళ్లూరుపేట సీఐ కార్యాల‌యంలో ఎన్‌3 న్యూస్‌తో ప్ర‌త్యేకంగా మాట్లాడారు. సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాల‌ను నియంత్రించ‌వ‌చ్చ‌ని తెలిపారు. ఈ మేర‌కు సీసీ కెమెరాల ఏర్పాటుపై వ్యాపారస్తులతో అవగాహన క‌ల్పిస్తున్న‌ట్లు చెప్పారు. ప్రతీ దుకాణంలో, అపార్ట్‌మెంట్ల‌లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సీఐ దుకాణ‌దారుల‌కు సూచించారు. చోరీలు నివారణకు సీసీ కెమెరాల ఏర్పాటు ఎంతో దోహ‌ద‌ప‌డుతుంద‌న్నారు. పోలీసుల‌కు ప్ర‌జ‌లంతా స‌హ‌క‌రించాల‌ని సీఐ…

Read More