నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు టిడిపి యువనేత దాట్ల చక్రవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడారు. క్యాన్సర్ తో పాటు 60 ప్రాణాంతక వ్యాధులకు సంబంధించి ఉచితంగా వైద్య పరీక్షలతోపాటు.. కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించడం జరుగుతుందని ఈసందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈసందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ రాష్ట్ర నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి కూడా ఈ సమావేశంలో పాల్గొని.. నారా లోకేష్ ఆరోగ్య రక్ష లోగోను ఆవిష్కరించారు.