విజయవాడ సిద్దార్ధ కాలేజీలో ప్యాకింగ్, పంపిణీ తీరును పరిశీలించిన మంత్రి నారాయణ
విజయవాడలో వరద బాధితుల కోసం ఐదు రకాల ఆహార పదార్ధాలను ప్రత్యేక ప్యాక్ ను రాష్ట్ర ప్రభుత్వం రెడీ చేసింది. ఈ నేపథ్యంలో…స్థానిక సిద్ధార్ధ కాలేజీలో ప్యాకింగ్, పంపిణీ తీరును రాష్ట్ర పురపాలక శాఖామంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ వెళ్లి స్వయంగా పరిశీలించారు. అనంతరం మంత్రి నారాయణ మీడియాతో మాట్లాడారు. వరద బాధితుల కోసం ఒక్కో ప్యాకెట్ లో 6 ఆపిల్స్, 6 బిస్కట్ ప్యాకెట్ లు,2 లీటర్ల పాల ప్యాకెట్లు,3 నూడిల్స్ ప్యాకెట్లు,2 లీటర్ల వాటర్ బాటిల్స్ ను ప్రభుత్వం పంపిణీ చేస్తుందన్నారు. అలాగే నిత్యావసరాల సరుకులు కూడా పంపిణీ ప్రారంభిస్తున్నామని చెప్పారు. ఇప్పటికే బుడమేరు గండి పూడ్చేందుకు ఆర్మీ రంగంలోకి దిగిందన్నారు. మరో 24 గంటల్లో గండి పూడ్చివేత పూర్తి కావచ్చన్నారు. ఆ తర్వాత మరో 24 గంటల్లో పారిశుధ్యం పనులు పూర్తి చేసేలా ముండుకెళ్తున్నామని పేర్కొన్నారు.