ల‌క్ష మందికి ఉపాధి హామీ ప‌నులు క‌ల్పించ‌డ‌మే ల‌క్ష్యం

  • ఉపాధి హామీ ప‌నుల‌పై ప్ర‌త్యేక దృష్టి
  • సంగంలో క‌లెక్ట‌ర్ ఆనంద్
నెల్లూరు జిల్లా సంగంలో జిల్లా క‌లెక్ట‌ర్ ప‌ర్య‌టించారు. బీరాపేరు సమీపంలో ఉపాధి హామీ పథకం పనులను కలెక్టర్ పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. కూలీలతో కాసేపు సరదాగా మాట్లాడారు. అనంతరం సంగంలో చెత్త సంపద కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ వసతులను పరిశీలించారు. చెత్త సంపద కేంద్రంలో వానపాములను ఒదిలి పెట్టారు.ఈ సందర్భంగా క‌లెక్ట‌ర్ మాట్లాడారు. ఉపాధి హామీలో ప్రస్తుతం రోజుకు 60 వేల మంది కూలీలు హాజరవుతున్నారని అన్నారు. ప్రజలు ఉపాధి హామీ పథకం పనులను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.ఎక్కడ మట్టి పనులు అవసరం ఉన్నా ఉపాధిహామీ సిబ్బంది తో ప్రజలు మాట్లాడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి సుస్మితా రెడ్డి,డ్వామా పి డి,తహసీల్దార్ సోమ్లా నాయక్,ఎంపీడీఓ అప్పాజీ,సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *