బుచ్చిలో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం పట్టణంలోని రిజిస్టర్ ఆఫీస్ సెంటర్ వద్ద బిజెపి పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. కిసాన్ మోర్చా జిల్లా కార్యదర్శి వినయ్ నారాయణ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి కిసాన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సురేంద్ర రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై సభ్యత్వ నమోదు ప్రక్రియను చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… దేశంలో బిజెపి అతి పెద్ద పార్టీగా నిలిచిందన్నారు. బిజెపి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత భారతదేశ ప్రఖ్యాతను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచానికే చాటి చెప్పారన్నారు. ఇతర దేశాలకు కూడా భారతదేశం వైపు చూస్తున్నాయన్నారు. 18 కోట్ల సభ్యత్వాలు ఉన్న ప్రభుత్వం బిజెపి అన్నారు. రాబోయే కాలంలో సభ్యత్వాలు ఎక్కువగా పెంచేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు. రాబోయే స్థానిక సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికలలోను బిజెపి సత్తాను చాటాలని ఆయన పిలుపునిచ్చారు.