- యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో genius 3.0 క్విజ్
- ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ బిందు మీనన్
- క్విజ్ కాంపిటేషన్కు పెద్ద సంఖ్యలో తరలి వచ్చిన విద్యార్థులు
నెల్లూరులోని పీఎస్ఆర్ కళ్యాణ వేదికలో… యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో యూ జీనియస్ 3.0 ఆలిండియా క్విజ్ కాంపిటేషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బింధు మీనన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు రీజినల్ హెడ్ ఎస్ రాజశేఖర్, Dy రీజినల్ హెడ్ శివశంకర్, వేణుగోపాల్లు అధ్యక్షత వహించారు. క్విజ్ కాంపిటేషన్కు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల నుంచి వెయ్యి మంది విద్యార్థులు ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్విజ్లో గెలుపొందిన విజేతకు రూ. 2 లక్షల నగదు పురస్కారంతో యూ జీనియస్ 3.0 టైటిల్ దక్కుతుందని నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతీ విద్యార్థికి యూనియన్ బ్యాంక్ వారి ప్రశంసా పత్రం, కిట్ బ్యాగ్లు అందచేశారు. ప్రాంతీయ మేనేజర్ ఏ రాజశేఖరం విద్యార్థుల్ని ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం…డాక్టర్ బీందు మీన్, యూనియన్ హెడ్, విద్యార్థులు మీడియాతో ప్రసంగించారు.