- విద్యార్థుల సమస్యలను తీరుస్తా
- జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఆనం అరుణమ్మ
- శ్రీ పచ్చిపాల రామనాధమ్మ బాలికల ఉన్నత పాఠశాలనున పరిశీలించిన జడ్పీచైర్పర్సన్, సీఈవో
నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా ఆఫీస్ వద్ద ఉన్న శ్రీ పచ్చిపాల రామనాథమ్మ బాలికల ఉన్నత పాఠశాలను నెల్లూరు జిల్లా పరిషత్ చైర్మన్ ఆనం అరుణమ్మ, జడ్పీ సీఈఓ పరిశీలించారు. ముందుగా అరుణమ్మకు కోవూరు జెడ్పిటిసి శ్రీలత ,,ఎంపీపీ పార్వతి, ఎంపీడీవో శ్రీహరి, ఎంపీటీసీ వేణు, ఉపాధ్యాయులు పూలబొకే అందచేసి శాలువాలతో ఘనంగా సన్మానించి ఘన స్వాగతం పలికారు.. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆనం దృష్టికి ఉపాధ్యాయులు తీసుకెళ్లారు. మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్ను పరిశీలించారు. అనంతరం ఆనం అరుణమ్మ మీడియాతో మాట్లాడారు.