- కనువిందు చేయనున్న గరుడ వాహన షత్భుజ లంబోదరుడు
- ఉత్సవ కమిటీ నిర్వాహకుడు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి
నెల్లూరు నగరంలోని లంబోదర సెంటర్లో కనీవిని ఎరగని రీతిలో వినాయక చవితి ఉత్సవాలను నిర్వహిస్తున్నామని వీటిలో ప్రతి ఒక్కరు భాగస్వాములై విజయవంతం చేయాలని లంబోదర సెంటర్ లో ఉత్సవ సమితి నిర్వాహకులు నూకరాజు మదన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు లంబోదర సెంటర్లో ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఐదు రోజులపాటు గణేష్ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ప్రత్యేకంగా 21 కేజీల లడ్డును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
ఈ కార్యక్రమంలో టిడిపి నేతలు దాట్ల చక్రవర్ధన్ రెడ్డి, అన్ లిమిటెడ్ బిల్డింగ్ అధినేత మాలకొండ రెడ్డి, బిల్డర్ శ్రీధర్ రెడ్డి, అశోక్ రెడ్డి ,కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి, శ్రావణ్ అశోక్ రెడ్డి, నరసారెడ్డి నరహరి, కిరణ్, భాస్కర్ రెడ్డి, సుధాకర్ రెడ్డి సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు.