హజరత్ సయ్యద్ ఖాజా నాయబ్ రసూల్ స్వాములవారి దర్గాను దర్శించిన కలెక్టర్
నెల్లూరు జిల్లా ఏ ఎస్ పేట మండలంలో జిల్లా కలెక్టర్ ఎం ఆనంద్ సుడిగాలి పర్యటన జరిపారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని ధర్మవరం గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. అక్కడ నుండి మండల కేంద్రమైన ఏఎస్ పేటకు చేరుకున్న కలెక్టర్ స్థానికంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన హజరత్ సయ్యద్ ఖాజా నాయబ్ రసూల్ స్వాముల వారి దర్గాను దర్శించుకున్నారు. దర్గా మర్యాదలతో కలెక్టర్ ను దర్గా ఈవో షేక్ మొహమ్మద్ హుస్సేన్,S,G,N హాఫీస్ పాష ఆహ్వానించి దర్శనం చేయించారు. అనంతరం ఈ నెలలో జరగనున్న గంధ మహోత్సవాలు సంబంధించి కలెక్టర్ ఈవో ద్వారా వివరాలు తెలుసుకొన్నారు. కార్యచరణ రూపొందించి పంపించాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. అక్కడ నుండి తెల్లపాడుకు చేరుకున్న కలెక్టర్ అక్కడ నిర్మాణంలో ఉన్న కాలనీలను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. చెత్త సంపద కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మీడియాతో మాట్లాడారు. కలెక్టర్ వెంట డిపిఓ సుస్మిత, తహసిల్దార్ శ్రీ రామకృష్ణ, శ్రీనివాసులు, స్థానిక సర్పంచ్ షేక్ జిలాని భాష, పంచాయతీ కార్యదర్శి యస్దాని భాష పాల్గొన్నారు….