ఆ..హాస్పిట‌ల్‌లో అన్నీ క‌ష్టాలే

అదెక్క‌డో తెలుసుకోవాలంటే…N3 చూడాల్సిందే

నీటి కొరతతో రోగులు వార్డులు ఖాళీ చేసి వెళ్తున్న దుస్థితి… తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణ ప్రభుత్వ ఆసుపత్రి చోటు చేసుకుంది. నీళ్లు లేక గ‌త రెండు రోజులుగా రోగులు తీవ్ర ఇబ్బందులు ప‌డుతున్నారు. వార్డుల్లో ఫ్యాన్లు ప‌ని చేయ‌క‌పోవ‌డంతో ఉక్క‌పోత‌తో రోగులు అల్లాడిపోతున్నారు. ఎన్నిసార్లు అధికారుల‌కు చెప్పినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని బాధిత పేషెంట్లు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవల కాలంలో మెరుగైన వైద్యం అందించాలని కూటమి ప్రభుత్వం అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నా… ప్రభుత్వంలోని కొన్ని శాఖల వల్ల అటు రోగులకి… ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుంది. మహిళలు నీటి సమస్యతో వార్డులు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నారు. మరోవైపు ఆసుపత్రిలో అటు హెల్పర్స్ కి ఇటు స్వీపర్స్ కి ఆరు నెలలుగా జీతాలు ఇవ్వలేదని… అసలే పండగ సమయం అని వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నీటి సమస్యపై స్పందించాలని రోగుల కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి సూప‌రింటెండెంట్‌ రమేష్ మీడియాతో మాట్లాడుతూ నీటి సమస్య పరిష్కారం చేస్తామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *