- రెండు హుండీలు, మైక్ వైర్ ఎత్తుకెళ్లిన దుండగులు
- అనంతసాగరంలో ఘటన
నెల్లూరు జిల్లా అనంతసాగరం మండలం పాతదేవరాయపల్లిలోని తుమ్మలమ్మ, పోలేరమ్మ ఆలయాల్లో గత అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరికి పాల్పడినట్లు స్థానికులు చెపుతున్నారు. స్థానికుల సమాచారం మేరకు… పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. రెండు హుండీలు, మైక్ వైర్ చోరీకి గురైనట్లు తెలుస్తుంది. అయితే దుండగులు హుండీలలో ఉన్న కొద్దిపాటి నగదును తీసుకువెళ్లి హుండీలను ఆలయ సమీపాల్లో పడేశారు. ఇదే ఆలయాల్లో గతంలో కూడా ఓ సారి చోరీ జరిగినట్లు స్థానికులు చెప్తున్నారు. రెండోసారి కూడా ఆలయాల్లో చోరీ జరగడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలో ఉన్నారు. ఆలయాలకు రక్షణ కల్పించాలని భక్తులు కోరుతున్నారు.