బుచ్చిలో జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలను సందర్శించిన జడ్పీ చైర్పర్సన్
నెల్లూరు జిల్లా బుచ్చి పట్టణంలోని జిల్లా ప్రజా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాలను జిల్లా జడ్పీ చైర్మన్ ఆనం అరుణమ్మ సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులను అడిగి వసతులపై ఆరా తీశారు. పాఠశాల ప్రహరీ గోడ ఏర్పాటుకు స్థలాన్ని పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పాఠశాలలో కనీసం మౌలిక వసతులు లేవని అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు.