Month: September 2024

నా రాజకీయ జీవితం శ్రీధర్రెడ్డికి అంకితం
సీనియర్ కార్పొరేటర్, వైసీపీ నేత పిండి సురేష్, 36వ డివిజన్ కార్పొరేటర్ ఆయన సతీమణి పిండి శాంతిశ్రీలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో… తెలుగుదేశం పార్టీ తీర్ధం పుచ్చుకున్నారు. నెల్లూరు నగరంలోని ఫత్తేఖాన్పేట సెంటర్ నుంచి ఎమ్మెల్యే కార్యాలయం వరకు ఆయన అభిమానులతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. అడుగడుగునా జై శ్రీధరన్న…జై గిరిన్న…జై టీడీపీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు హోరెత్తించారు. ఈ సందర్భంగా పిండి…

ప్రజల ముంగిటకే వైద్య సేవలు…
నెల్లూరు రూరల్ నియోజకవర్గం ప్రజల ఆరోగ్యమే లక్ష్యంగా నారా లోకేష్ ఆరోగ్య రక్ష కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నట్లు టిడిపి యువనేత దాట్ల చక్రవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం ఆయన మాట్లాడారు. క్యాన్సర్ తో పాటు 60 ప్రాణాంతక వ్యాధులకు సంబంధించి ఉచితంగా వైద్య పరీక్షలతోపాటు.. కార్పోరేట్ ఆసుపత్రుల్లో వైద్యం అందించడం జరుగుతుందని ఈసందర్భంగా ఆయన పేర్కొన్నారు. ఈసందర్భంగా రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, టీడీపీ రాష్ట్ర…

ఏఎస్పేటలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
హజరత్ సయ్యద్ ఖాజా నాయబ్ రసూల్ స్వాములవారి దర్గాను దర్శించిన కలెక్టర్ నెల్లూరు జిల్లా ఏ ఎస్ పేట మండలంలో జిల్లా కలెక్టర్ ఎం ఆనంద్ సుడిగాలి పర్యటన జరిపారు. ఈ సందర్భంగా ఆయన మండలంలోని ధర్మవరం గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. అక్కడ నుండి మండల కేంద్రమైన ఏఎస్ పేటకు చేరుకున్న కలెక్టర్ స్థానికంగా ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రమైన హజరత్ సయ్యద్ ఖాజా నాయబ్ రసూల్ స్వాముల వారి దర్గాను దర్శించుకున్నారు….

గెలిస్తే…రూ. 2 లక్షలు
నెల్లూరులోని పీఎస్ఆర్ కళ్యాణ వేదికలో… యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో యూ జీనియస్ 3.0 ఆలిండియా క్విజ్ కాంపిటేషన్ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా అపోలో స్పెషాలిటీ హాస్పిటల్ సీనియర్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బింధు మీనన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నెల్లూరు రీజినల్ హెడ్ ఎస్ రాజశేఖర్, Dy రీజినల్ హెడ్ శివశంకర్, వేణుగోపాల్లు అధ్యక్షత వహించారు. క్విజ్ కాంపిటేషన్కు రాష్ట్ర వ్యాప్తంగా ఆరు జిల్లాల నుంచి వెయ్యి మంది విద్యార్థులు…

అంతా…నా ఇష్టం
ఎవరి అనుమతులు లేకుండా పాఠశాలలోని మరుగుదొడ్లు, చెట్లను సర్పంచ్ కూల్చేసిన ఘటన… నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం రేగడిచెలికలో చోటు చేసుకుంది. కొడవలూరు మండలం రేగడ చేరిక ఎన్ఎస్ఆర్ గిరిజన కాలనీలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉంది. ఈ పాఠశాలకు మరుగుదొడ్లను ప్రభుత్వం నిర్మించి ఉంది. ఈ మరుగుదొడ్లు, చెట్లు, వాటర్ ట్యాంక్లను ఎటువంటి అనుమతులు లేకుండా గ్రామ సర్పంచ్ నల్లావుల శ్రీనివాసులు కూల్చేశాడని గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు ఇదేమిటని…

నాయుడుపేటలో భారీ గణనాథులు
అందరిని ఆకర్షించేలా సెట్టింగ్లు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాల్టీలోని దర్గా వీధిలో భారీ గణనాధుని వ్యాపారస్తులు ఏర్పాటు వేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా 23 అడుగుల ఎత్తు, మూడు టన్నుల బరవు కలిగి వినాయక ప్రతిమకి అందరిని ఆకర్షించేలా ఎస్.జే రాజేష్ కమిటీ సభ్యులు చవితి వేడుకలకు సర్వం సిద్దం చేస్తున్నామని తెలిపారు. రేపు ఉదయం పదిగంటల నుంచి భక్తుల స్వామి వారి దర్శించుకోవాలని నిర్వాహుకులు భక్తులను విజ్ఞప్తి చేశారు. తొమ్మిది రోజులు పాటు పట్టణంలో…

ఆ..ఘనత కాకాణిదే…
మాదరాజు గూడూరులో సోమిరెడ్డి హౌసింగ్ విజిట్ కోట్ల రూపాయల విలువైన స్థలాలను నిర్వాసిత గ్రామాలకు ఇస్తే… వాటి పనులను ఆపించిన ఘనత కాకాని గోవర్ధన్ రెడ్డి అని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం బ్రహ్మదేవి పంచాయతీ, మాదరాజు గూడూరు సమీపంలో నిర్మిస్తున్న నేలటూరు నిర్వాసిత గ్రామంలో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పర్యటించారు. సోమిరెడ్డితో పాటు నెల్లూరు రూరల్ టిడిపి నాయకులు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, బిజెపి…

అతడికి..భూమ్మీద ఇంకా నూకలున్నాయ్..!
రైలు కింద పడి చనిపోవాలనుకున్నాడు-మహిళలు చూసి కేకలేశారు.. యువకులు కాపాడేశారు-నెల్లూరు రైల్వే స్టేషన్లో ఘటన అతడికి ఏం కష్టం వచ్చిందో.. ఎంత ఇబ్బంది వచ్చిందో.. ఎవరేమైనా అన్నారో లేక ఆర్థిక ఇబ్బందులో.. ఇంకేమైనా కారణమోగాని.. రైలుకిందపడి ఆత్మహత్యాయత్నం చేశాడో వ్యక్తి. అతడెళ్లి రైలుకింద పడబోతే.. అక్కడే ఉన్న కొందరు మహిళలు కేకలు వేశారు. ఇంకొందరు విద్యార్థులు అది గమనించారు. వెంటనే అతడ్ని కాపాడేశారు. అందరూ ఊపిరి పీల్చుకున్నారు.. క్షణాల్లో జరిగిన ఈ ఘటన నెల్లూరు సౌత్ రైల్వే…

ఆర్అండ్బీ స్థలంలో…ఇంటి నిర్మాణం
ఆక్రమణను అడ్డుకున్న సెక్రటరీ, వీఆర్వో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లి గ్రామంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రహరీ గోడకు పక్కన ఉన్న R&B స్థలంలో గ్రామానికి చెందిన ఒక వ్యక్తి స్థలాన్ని ఆక్రమించి ఇల్లు నిర్మిస్తున్నారు. ఈ విషయం తెలుసుకున్న పంచాయతీ సెక్రెటరీ చలపతి వీఆర్వో సిబ్బందితో కలిసి వెళ్లి అక్రమణ నిర్మాణాన్ని అడ్డుకున్నారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని అన్నారు.