
జాతీయ రహదారిపై నిలిచిపోయిన వాహనాలు
నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం చౌటపాలెం సమీపంలో తెల్లవారు జామున జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కిలోమీటర్లు మేర వాహనాలు రోడ్లపై నిలిచిపోయాయి. ఉద్యోగులు, స్కూల్స్, కాలేజీ లకు వెళ్ళేసమయం కావడంతో మరింత ట్రాఫిక్ ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోలీసులు పరిస్థితిని చక్కదిద్దారు.