శ్రీశైల మల్లన్న స్వర్ణ రథోత్సవంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

స్వామివారిని ద‌ర్శించిన వీపీఆర్ కుటుంబ స‌భ్యులు

శ్రీశైల మహక్షేత్రం ఓం నమశ్శివాయ నామస్మరణతో మార్మోగింది. అడుగడుగునా భక్త జన సందోహం మధ్య శ్రీ భ్రమరంబ,మల్లికార్జున స్వామి వార్ల స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా సాగింది. ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని… స్వర్ణ రథోత్సవ దాతలు కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి , ఆలయ అధికారుల ఆధ్వర్యంలో శ్రీశైల మల్లన్న స్వర్ణ రథోత్సవ కార్యక్రమం వైభ‌వంగా నిర్వ‌హించారు. భక్తుల కోలాటాల మధ్య, హర్షద్వానాల మధ్య స్వర్ణ రథంపై స్వామివారు ఊరేగుతూ భక్తులను కటాక్షించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి కుటుంబ సమేతంగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ప్రశాంతి రెడ్డి తనయులు అర్జున్ రెడ్డి, కుటుంబ సభ్యులు హనీష్, ముంగమూరు చైతన్య, ఆలయ అధికారులు పెద్దిరాజు, ఆలయ అర్చకులు, సిబ్బంది, టిడిపి నేతలు దువ్వూరు కళ్యాణ్ రెడ్డి, బెజవాడ వంశీ రెడ్డి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *