సూళ్లూరుపేట‌లో సంబ‌రంగా కృష్ణాష్ట‌మి సంబ‌రాలు

కృష్ణుడికి ప్ర‌త్యేక అలంక‌ర‌ణ‌, పూజ‌లు, భ‌క్తుల చేత య‌జ్ఞాలు

తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలో కే.ఆర్.పి శ్రీ సాయి సన్నిధి సత్సంగ మందిర్, షార్ బస్టాండ్ సెంటర్, పీర్లచావిడి సెంటర్ వద్ద శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముందుగా కె.ఆర్.పి వద్ద ఉన్న శ్రీ సాయి సన్నిధి సత్సంగ మందిర్ ఆవరణంలో కమిటీ సభ్యులు మునిరెడ్డి ఆధ్వర్యంలో భక్తుల చేతుల మీదుగా యజ్ఞం నిర్వహించారు. సాయిబాబా ఆలయ నిర్వహకులు గోపి మాట్లాడుతూ… గత 19 ఏళ్లుగా జరుపుకుంటున్నామని తెలిపారు. అనంతరం షార్ బస్టాండ్ సెంటర్ వద్ద గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో జన్మాష్టమి వేడుకలు ఘనంగా జరిపారు. అలాగే కచేరివీధిలో పీర్లచావడి సెంటర్ వద్ద జై గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో మారిబోయిన పాండురంగ యాదవ్ చేతుల మీదుగా శ్రీకృష్ణునికి ప్రత్యేక పుష్పాలు, నెమలి పింఛాలతో అలంకరించి జన్మాష్టమి వేడుకలను ఘనంగా జరిపారు. పాండు మాట్లాడుతూ… పట్టణ ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపారు. గత తొమ్మిది సంవత్సరాలుగా ఈ కృష్ణాష్టమి వేడుకలు జరుపుకుంటున్నామని తెలియజేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. స్వామి వారికి ఇష్టమైన వెన్న, పాలతో చేసిన క్షీరాన్నం, అటుకులు, పరమాన్నం ప్రసాదంగా భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో సాయిబాబా ఆలయ కమిటీ సభ్యులు, వైస్ చైర్మన్ ముంగర అమరావతి, ఎంపీపీ అల్లూరు అనిల్ రెడ్డి, కౌన్సిలర్ మీజూరు రామకృష్ణారెడ్డి, మారిబోయిన వాసు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *