గ్రామ స్థాయి నుంచి సభ్యత్వ నమోదు చేపట్టాలి
-ఇప్పటికే రాష్ట్రంలో 39 లక్షల సభ్యత్వాలు నమోదు
-బీజేపీ మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ
నెల్లూరు జిల్లాలో భారతీయ జనతాపార్టీ బలమైన పార్టీగా అవతరిస్తోంది. రానున్న ఎన్నికల్లో బీజేపీ సంఖ్యాబలం పెంపొందించే క్రమంలో సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగిందని.. బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షులు షేక్ బాజీ తెలిపారు. జిల్లా పార్టీ అధ్యక్షులు వంశీధర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం నెల్లూరు నగరంలోని బీజేపీ కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో సెప్టెంబరు ఒకటో తేదీన భారత ప్రధాని మోదీ, జాతీయ అధ్యక్షులు నడ్డా వద్ద నుంచి సభ్యత్వం స్వీకరించాక.. ఆంధ్రప్రదేశ్లో 39 లక్షల సభ్యత్వాన్ని నమోదు చేయించడం జరిగిందన్నారు. రాష్ట్ర అధ్యక్షులు దగ్గుబాటి పురంధేశ్వరి ఆలోచనలతో.. రాష్ట్రంలో ఇటీవల ఎన్నికల్లో గెలిచిన ముగ్గురు పార్లమెంటు సభ్యులు, ఎనిమిది మంది ఎమ్మెల్యేలు, ఓ కేంద్ర మంత్రి ఉన్న నియోజకవర్గాలతోపాటు.. భారతీయ జనతాపార్టీని బలవంతమైన శక్తిగా మార్చడం కోసం ప్రయత్నం జరుగుతుందో.. ఆ ప్రాంతంలోని కార్యకర్తల సమూహానన్ని నిర్మాణం చేయడంతోపాటు దక్షణాది రాష్ట్రాల్లో బీజేపీకి బలమే లేదన్న మాటల్ని తిప్పికొడుతూ.. 2024 ఎన్నికల్లో చేసిన ప్రయోగం విజయవంతమైదన్నారు. గత పాలనలో అవినీతి జరిగిందని.. సంక్షేమ పథకాలు విస్మరించబడ్డాయని ఆయన తెలిపారు. అలాగే.. నెల్లూరు జిల్లాలో గ్రామ స్థాయి నుంచి సభ్యత్వ నమోదు చేపట్టాలని ఆయన శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇంకా పలు విషయాలను ఆయన వెళ్లడించారు. ఈ కార్యక్రుమంలో బీజేపీ మైనారిటీ నాయకులు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.