- ఎంపీ వేమిరెడ్డి
- అల్లూరులో వీపీఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో వాటర్ ప్లాంట్ ఏర్పాటు
ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు మధ్య చాలా తేడాలు ఉన్నాయని నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. నెల్లూరు జిల్లా అల్లూరు మండలం నార్త్ మోపూరు మరియు ఇందుపూరు గ్రామాల్లో విపిఆర్ ఫౌండేషన్ ద్వారా నూతనంగా ఏర్పాటు చేసిన అమృత ధార వాటర్ ప్లాంట్లను ప్రారంభించారు. వీటిని కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకట కృష్ణారెడ్డి తో కలిసి ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి మాట్లాడుతూ…గత ముఖ్యమంత్రి వద్ద తాను పనిచేశానని… ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వద్ద కూడా పనిచేశానని అయితే వీరిద్దరి మధ్య చాలా తేడా ఉందని అన్నారు. అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గ్రామస్థాయిలో అభివృద్ధి జరగాలంటే గ్రామసభలు నిర్వహించాలని కోరడం చాలా ఆనందంగా ఉందన్నారు. రానున్న ఐదు సంవత్సరాలు కావలి ఎమ్మెల్యే వెంకట కృష్ణారెడ్డి అభివృద్ధి పదంలో కావాలని ముందుండి నడిపిస్తారని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే కావ్య ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వేమిరెడ్డి కోటారెడ్డి, బీద గిరిధర్, ఎంపీపీ శశిరేఖ ,కార్యకర్తలు పాల్గొన్నారు.