వెంక‌య్య‌స్వామి ఆరాథ‌నోత్స‌వాల్లో సోమిరెడ్డి

స్వామి వారికి ప‌ట్టువ‌స్త్రాలు స‌మ‌ర్పించిన ఎమ్మెల్యే

నెల్లూరు జిల్లా వెంక‌టాచ‌లం మండ‌లం గొల‌గ‌ముడిలో వెల‌సి ఉన్న‌…వెంక‌య్య‌స్వామి ఆశ్ర‌మంలో 42వ ఆరాధ‌న మ‌మ‌హోత్స‌వం జ‌రుగుతున్నాయి. ఈ కార్య‌క్ర‌మంలో స‌ర్వేప‌ల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్‌రెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఎమ్మెల్యేకి ఆల‌య నిర్వాహ‌కులు, అర్చ‌కులు ఆల‌య మ‌ర్యాద‌ల‌తో ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా వెంక‌య్య‌స్వామి వారికి సోమిరెడ్డి ప‌ట్టు వ‌స్త్రాలు స‌మ‌ర్పించారు. అనంత‌రం స్వామి వారిని ద‌ర్శించి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ, సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించామ‌ని సోమిరెడ్డి తెలిపారు. భగవాన్ శ్రీ వెంకయ్య స్వామి ఆశ్రమానికి వచ్చే భక్తుల కోసం మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామ‌ని హామీ ఇచ్చారు. వెంకయ్య స్వామి ఆశీస్సులతో సర్వేపల్లి నియోజకవర్గం పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు జరిగి ప్రజలందరికీ మంచి జరగాలని కోరుకున్నానన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *