ఎష‌న్షియ యాజ‌మాన్యాన్ని వెంట‌నే అరెస్ట్ చేయాలి

  • సీఐటీయూ డిమాండ్‌
  • నెల్లూరులోని లేబ‌ర్ ఫ్యాక్ట‌రీస్ ఇన్‌స్పెక్ట‌ర్ కార్యాల‌యం ఎదుట‌ ధ‌ర్నా

అచ్యుతాపురం ఎష‌న్షియ ఫారా కంపెనీలో జ‌రిగిన ప్ర‌మాదంపై యాజ‌మాన్యాన్ని వెంట‌నే అరెస్ట్ చేయాల‌ని డిమాండ్ చేస్తూ… నెల్లూరులోని లేబ‌ర్ ఫ్యాక్ట‌రీస్ ఇన్‌స్పెక్ట‌ర్ కార్యాల‌యం ఎదుట‌ ధ‌ర్నా సీఐటీయూ ధ‌ర్నా చేప‌ట్టింది. యాజ‌మాన్యాన్ని అరెస్ట్ చేయాల‌ని…త‌క్షణ‌మే మృతుల‌కు కోటి రూపాయ‌లు ప‌రిహారం ఇవ్వాల‌ని నినాదాలు చేశారు. అదే విధంగా నెల్లూరు జిల్లాలోని ప‌రిశ్ర‌మ‌ల్లో కార్మికుల‌కు భ‌ద్ర‌త‌, ర‌క్ష‌ణ క‌ల్పించాల‌ని అధికారుల్ని కోరారు. అనంత‌రం…ఇండ‌స్ట్రీయ‌ల్ కారిడార్ కార్య‌ద‌ర్శి గోగుల శ్రీ‌నివాసులు, నెల్లూరు జిల్లా సీఐటీయూ అధ్య‌క్షులు టీవీవీ ప్ర‌సాద్ లు మీడియాతో మాట్లాడారు. కేవ‌లం యాజ‌మాన్యం నిర్ల‌క్ష్యం కార‌ణంగానే 18 మంది కార్మికుల నిండు ప్రాణాలు బ‌లై పోయాయ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా ఉన్న‌తాధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో సీఐటీయూ జిల్లా కార్య‌ద‌ర్శి అజ‌య్‌కుమార్‌, సీఐటీయూ నాయ‌కులు, కార్మికులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *