ఎట్ట‌కేల‌కు పిన్నెల్లి విడుద‌ల‌…

జైలు వ‌ద్ద రామ‌కృష్ణారెడ్డికి స్వాగ‌తం ప‌లికిన మాజీ మంత్రులు

2024 ఎన్నిక‌ల సార్వ‌త్రిక ఎన్నిక‌ల స‌మ‌యంలో…ఈవీఎం ధ్వంసం, సీఐపై దాడి కేసుల్లో మాచ‌ర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి అరెస్ట్ చేసి నెల్లూరు జిల్లా జైలుకు పంపించిన విష‌యం విధిత‌మే. ఈవీఎం ధ్వంసం కేసులో…సుమారు 59 రోజులు ఆయ‌న రిమాండ్ అనుభ‌వించారు. ఈ క్ర‌మంలో పిన్నెల్లికి ఏపీ హై కోర్ట్ బెయిల్ మంజూరు చేసింది. ఆగ‌స్ట్ 23వ‌తేదీ సాయంత్ర‌మే రామ‌కృష్ణారెడ్డికి బెయిల్ వ‌చ్చింది. బెయిల్ వ‌చ్చినా…మ‌ళ్లీ పీడీ యాక్ట్ పెట్టి మ‌ళ్లీ పిన్నెల్లిని అరెస్ట్ చేస్తార‌న్న ప్ర‌చారం జోరుగా సాగ‌డంతో…జైలు వ‌ద్ద హైటెన్ష‌న్ వాతావ‌ర‌ణం నెల‌కొంది.

ఈ నేప‌థ్యంలో…జైలు ప్రాంగ‌ణాన్ని పోలీసులు భారీగా మొహ‌రించారు. అయితే ఆర్డ‌ర్ కాపీలు ఆల‌స్యం కావ‌డంతో… ఆగ‌స్ట్ 24వ‌తేదీ ఉద‌యం 10 గంట‌ల‌కు జైలు అధికారులు ఆయ‌న్ని విడుద‌ల చేశారు. జైలు వ‌ద్ద‌కు చేరుకున్న మాజీ మంత్రులు అనిల్ కుమార్ యాద‌వ్‌, కాకాణి గోవ‌ర్ధ‌న్‌రెడ్డిలు పిన్నెల్లికి స్వాగ‌తం ప‌లికారు. మొత్తం మీద‌…పిన్నెల్లి రామ‌కృష్ణారెడ్డి విడుద‌ల..ఓ హైడ్రామాగా కొన‌సాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *