- నెల్లూరులో మూత పడ్డ హాస్పిటల్స్
- అల్లాడిపోయిన ప్రజలు
కోల్కత్తాలో ట్రైనీ వైద్యురాలపై హత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు నిరసనగా…నెల్లూరులోని హాస్పిటళ్లు అన్నీ మూత పడ్డాయి. దీంతో…24 గంటల పాటు హాస్పిటల్లో వోపీ వైద్య సేవలను నిలిపి వేశారు. నిత్యం రద్దీగా ఉన్న నగరంలోని పొగతోట కూడలి ఒక్క సారిగా నిర్మానుషంగా మారిపోయింది. ఈ క్రమంలో…ఈ విషయం కొంత మందికి తెలియకపోవడంతో… తల్లిదండ్రులు తమ చంటి బిడ్డలను ఎత్తుకొని…పొగతోటలోని హాస్పిటళ్ల కోసం వెతుక్కుంటూ తిరుగుతున్నాయి. ఒక్క సారిగా వైద్య సేవలు నిలిచిపోవడంతో… ప్రజలు అల్లాడిపోయారు.