- శ్రీ సూర్య జూయలర్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి
- ఘన స్వాగతం పలికిన షోరూమ్ అధినేతలు గుర్రం రవికుమార్, సూర్య, డాక్టర్ సుజిత
- హీరోయిన్ను చూసి రాధిక అంటూ.. కేకలు వేసి సందడి చేసిన యువత
నెల్లూరు నగరం మాగుంట లేఅవుట్లోని కింగ్స్ కోర్ట్ అవెన్యూలో…రవి కుమార్ గుర్రం, సూర్య గుర్రం, డాక్టర్ సుజితలు శ్రీ సూర్య జ్యూయలర్స్ గోల్డ్, సిల్వర్, డైమండ్స్ షోరూమ్ అట్టహాసంగా ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా డీజే టిల్లు ఫేమ్ నేహాశెట్టి విచ్చేశారు. ముందుగా హీరోయిన్ కి షోరూమ్ అధినేతలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నేహాశెట్టి చేతుల మీదుగా షోరూమ్ని ప్రారంభించారు. నేహాశెట్టిని చూసేందుకు అభిమానులు, ప్రజలు పెద్ద సంఖ్యలో విచ్చేశారు. రాధిక రాధిక అంటూ యువత కేకలు వేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం నేహాశెట్టి మీడియాతో మాట్లాడారు.