క‌న్నీళ్లు పెట్టిన వైద్యులు…

  • నిందితుల్ని క‌ఠినంగా శిక్షించండి
  • సూళ్లూరుపేట‌లో న‌ల్ల బ్యాడ్జీల‌తో నిర‌స‌న
  • 24 గంట‌ల పాటు వైద్య సేవ‌లు బంద్

కోల్‍కత్తాలో ట్రైనీ వైద్యురాలపై హత్యాచారం చేసి హత్య చేసిన ఘటనకు నిరసనగా తిరుపతి జిల్లా సూళ్లూరుపేట పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల వైద్యులు ఆందోళ‌న చేప‌ట్టారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ…నల్ల బ్యాడ్జీలతో నిరసన ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ…త‌మ క‌న్నీటితో తీవ్ర ఆవేద‌న‌ను వ్య‌క్తం చేశారు. ఇంత‌టి దారుణానికి ఒడిగ‌ట్టిన నిందితుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *