పేద‌ల క‌డుపు నింపాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం…

  • రూ. 15ల‌కే మూడు పూట‌లా నాణ్య‌మైన భోజ‌నం
  • ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్ర‌శాంతిరెడ్డి
  • నెల్లూరు 8వ డివిజ‌న్‌లో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే

ఆకలితో వున్న పేదవాడికి పట్టెడన్నం పెట్టాలన్న స్వర్గీయ ఎన్టిఆర్ ఆశయాన్ని… సిఎం చంద్రబాబు నాయడు అన్న క్యాంటీన్ల ద్వారా అమలు చేస్తున్నారన్నారని… కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు. నెల్లూరు న‌గ‌రం 8వ డివిజ‌న్ త‌డిక‌ల బ‌జారులోని అన్న క్యాంటీన్ ప్రారంభోత్స‌వం జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ఎమ్మెల్యే వేమిరెడ్డి విచ్చేసి అన్న క్యాంటీన్ ను ప్రారంభించారు. ముందుగా స్థానిక కూట‌మి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు ఎమ్మెల్యేకి ఘ‌న స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం అంద‌రితో క‌లిసి ప్ర‌శాంతిరెడ్డి అల్పాహారం భుజించారు. ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే వేమిరెడ్డి మీడియాతో మాట్లాడారు. అన్ని దానాలలో కెల్లా అన్న దానం గొప్పదన్నారు. అన్న క్యాంటీన్ల ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్టంలో నిత్యాన్నదాన పధకానికి శ్రీకారం చుట్టారన్నారు. కేవలం 5 రూపాయలకే పేదల కడుపు నింపాలన్న మహోన్నత లక్ష్యంతో పునః ప్రారంభించిన అన్న క్యాంటీన్లను నిరుపేద‌లు సద్వినియోగ చేసుకోవాలని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో కూట‌మి నేత‌లు, కార్పొరేష‌న్ అధికారులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *