ఇచ్చిన మాట‌ని నిల‌బెట్టుకున్నాం…

  • అధికారంలోకి వ‌చ్చిన రెండు నెల‌ల్లోనే 100 అన్న క్యాంటీన్లు ఓపెన్ చేశాం
  • రూ. 15ల‌కే పేద‌ల‌కి మూడు పూట‌లా నాణ్య‌మైన భోజ‌నం
  • రాష్ట్ర మంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ‌
  • నెల్లూరు చేప‌ల మార్కెట్ వ‌ద్ద ఉన్న అన్న క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి, అజీజ్‌, శ్రీ‌నివాసులురెడ్డి
  • నిరుపేద‌ల‌కు స్వ‌యంగా టిఫిన్లు వ‌డ్డించిన మంత్రి
  • అంద‌రితో క‌లిసి అల్పాహారం చేసిన నారాయ‌ణ‌, అజీజ్‌, శ్రీ‌నివాసులురెడ్డి

అధికారంలోకి రాగానే…అన్న క్యాంటీన్ల‌ను పునః ప్రారంభిస్తామ‌ని…ఎన్నిక‌ల్లో రాష్ట్ర ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబునాయుడు ఇచ్చిన వాగ్ధానాన్ని నిల‌బెట్టుకున్నార‌ని… రాష్ట్ర పుర‌పాల‌క, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖామంత్రి డాక్ట‌ర్ పొంగూరు నారాయ‌ణ తెలియ‌జేశారు. నెల్లూరు నగరం చేపల మార్కెట్ వద్ద ఉన్న అన్నా క్యాంటీన్ ను నెల్లూరు పార్ల‌మెంట్ అధ్యక్షులు అబ్ధుల్ అజీజ్‌, టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కోటంరెడ్డి శ్రీ‌నివాసులురెడ్డిల‌తో క‌లిసి ఆయ‌న అన్న క్యాంటీన్‌ను ప్రారంభించారు. ముందుగా మంత్రి నారాయ‌ణ‌కి స్థానిక టీడీపీ నేత‌లు, కార్య‌క‌ర్త‌లు అపూర్వ స్వాగ‌తం ప‌లికారు. ఈ సంద‌ర్భంగా నిరుపేద‌ల‌కి స్వ‌యంగా మంత్రి నారాయ‌ణే టిఫిన్ వ‌డ్డించి…ఎలా ఉందో అడిగి తెలుసుకున్నారు. నారాయ‌ణ సార్ చాలా బాగుంది సార్‌…అని చెప్ప‌డంతో మంత్రి సంతోషం వ్య‌క్తం చేశారు. అనంత‌రం టీడీపీ నేత‌లు, నిరుపేద‌ల‌తో క‌లిసి ఆయ‌న కూడా అల్పాహార విందు చేశారు. అనంత‌రం మంత్రి నారాయ‌ణ మీడియాతో మాట్లాడారు. నిరుపేద‌ల‌కి రూ. 15ల‌కే మూడు పూట‌లా క‌డుపు నిండా నాణ్య‌మైన భోజ‌నం పెట్టేందుకు…రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్ల‌ను నిరంత‌రం కొన‌సాగిస్తామ‌ని హామీ ఇచ్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *