- ప్రభుత్వ కార్యాలయాల్లో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
- జాతీయ జెండాను ఆవిష్కరించిన అధికారులు, ప్రజాప్రతినిధులు
ఎందరో మహానుభావుల త్యాగాల ఫలితంగానే భారతదేశానికి స్వాతంత్రం వచ్చిందని తహశీల్దార్ క్రిష్ణా రెడ్డి,ఎంపిపీ చింతంరెడ్డి పద్మావతి అన్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండలంలోని అన్ని ప్రభుత్వ కార్యలయాలలో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆయా కార్యాలయాలలో జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… విద్యార్థులు మహనీయుల త్యాగఫలితాలను ఆదర్శంగా తీసుకుని ఉన్నత చదువులను అభ్యసించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో మస్తాన్ వలి,ఈవోపిఆర్డి భార్గవి, వైసీపీ మండల కన్వీనర్ చింతంరెడ్డి సుబ్బారెడ్డి,మాజీ ఎంపిపి అబ్రహం,కోఆప్షన్ సభ్యులు హైదారాలి,తదితరులు పాల్గొన్నారు.