త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన సీఐ, ఎస్ఐలు
నెల్లూరు జిల్లా సంగం పోలీస్ స్టేషన్లో పోలీస్ లలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఎస్ఐ నాగార్జున రెడ్డి, నూతన సీఐ వేమారెడ్డి బదిలీ అయిన సీఐ రవి నాయక్ తో కలిసి జెండా ఆవిష్కరించారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చేందుకు ప్రాణ త్యాగం చేసిన మహాత్ముల గురించి స్మరించుకున్నారు. అనంతరం మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమం లో పోలీసు కార్యాలయాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.