విశ్వ‌సాయి డాక్ట‌ర్ ఎస్ఆర్‌కేలో ఘ‌నంగాస్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు

  • జాతీయ జెండాను ఆవిష్క‌రించిన చైర్మ‌న్ స‌త్య‌నారాయ‌ణ‌
  • ఆక‌ట్టుకున్న విద్యార్థుల సాంస్కృతి కార్య‌క్ర‌మాలు

నెల్లూరు న‌గ‌రం మాగుంట లేఅవుట్ లోని విశ్వ‌సాయి డాక్ట‌ర్ ఎస్ఆర్‌కే స్కూల్‌లో… 78వ స్వాతంత్ర దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా విద్యా సంస్థ‌ల డైరెక్ట‌ర్ కృష్ణ‌మోహ‌న్ జాతీయ జెండాను ఆవిష్క‌రించారు. ప్రిన్సిపాల్ ర‌ఘురామ్ విద్యార్థుల‌కు స్వాతంత్ర దినోత్స‌వ ప్రాముఖ్య‌త‌ను వివ‌రించారు. పంద్రాగ‌స్ట్ ని పుర‌స్క‌రించుకొని… విద్యార్థుల‌కి వివిధ పోటీలు నిర్వ‌హించారు. గెలుపొందిన విజేత‌ల‌కు బ‌హుమ‌తులు ప్ర‌దానం చేశారు. దేశ భ‌క్తి గీతాలు, పిర‌మిడ్‌లు, మార్ష‌ల్ ఆర్ట్స్ షో, యోగా షో, మ్యూజిక్‌, నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌లను విద్యార్థులు అద్భుతంగా ప్ర‌ద‌ర్శించారు. విద్యార్థులను విద్యా సంస్థ‌ల చైర్మ‌న్ స‌త్య‌నారాయ‌ణ ప్ర‌త్యేకంగా అభినందించారు. అనంత‌రం డైరెక్ట‌ర్ కృష్ణ‌మోహ‌న్‌, ప్రిన్సిపాల్ ర‌ఘురాంలు మీడియాతో మాట్లాడారు. ఎంద‌రో మ‌హానుభావుల త్యాగ ఫ‌లిత‌మే స్వాతంత్రం వ‌చ్చింద‌న్నారు. విద్యార్థులు నైతిక‌త‌నున అల‌వ‌ర్చుకోవాల‌ని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో విద్యా సంస్థ‌ల ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *