- అన్నీ కార్యాలయాల్లో రెపరెపలాడిన మువ్వెన్నల జెండా
- త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించిన అధికారులు
నెల్లూరు జిల్లా విడవలూరు మండలం దంపూరు పంచాయితీలోని ప్రభుత్వ కార్యాలయాల్లో, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. ముందుగా జాతీయ జెండాను గ్రామ వార్డు సచివాలయం, ప్రభుత్వ పాఠశాలలో గ్రామ సర్పంచ్ సురేందర్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించి 78వ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల హెడ్మాస్టర్ మాట్లాడుతూ… నిన్నటి నుండి దంపూరు యువత ఎంతో కష్టపడి పాఠశాల ప్రాంగణాన్ని అందంగా చేశారని… అలాగే భారత దేశ చిత్రపటాన్ని అద్భుతంగా వేసిన యువతకు ధన్యవాదాలు తెలిపారు. అనంతరం స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ కిరణ్మయి, ఎంపీటీసీ భాను, వైస్ సర్పంచ్ శ్రీనివాసులు, దూది విజయ రాఘవ్, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ రవి, దంపూరు యువత స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…