- ప్రభుత్వ కార్యాలయాల్లో రెపరెపలాడిన త్రివర్ణ పతాకం
- జాతీయ జెండాను ఆవిష్కరించిన అధికారులు
నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.. అన్ని కార్యాలయాల ముందు జాతీయ జెండా రెపరెపలాడింది.. తహసిల్దార్, ఎంపీడీవో, మున్సిపల్ ,పోలీస్ స్టేషన్ కార్యాలయాల్లో అధికారులు జాతీయ జెండాను ఆవిష్కరించి 78వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ… ఎందరో స్వాతంత్ర పోరాటయోధుల పోరాటానికి పలితమే మనకు స్వాతంత్రం వచ్చిందన్నారు. అనంతరం స్కూల్ విద్యార్థినీ విద్యార్థులకు మిఠాయిలు పంచిపెట్టారు… ఈ కార్యక్రమంలో మండల అధికారులు, మండల నాయకులు, సిబ్బంది స్కూల్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు…