పొద‌ల‌కూరులో రెప‌రెప‌లా మువ్వెన్న‌ల జెండా…

ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఘ‌నంగా పంద్రాగ‌స్ట్ వేడుక‌లు

నెల్లూరు జిల్లా పొద‌ల‌కూరు మండలంలోని పలు కార్యాలయాలలో 78 వ స్వాతంత్ర‌ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దారు సారంగపాణి జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం చేశారు . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… భావి భారత పౌరులుగా పాఠశాల స్థాయి నుండి విద్యార్ధులు దేశ భ క్తిని పెంపొందించుకోవాలని తెలియజేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో ఎస్సై రామకృష్ణ, సామాజి ఆరోగ్యకేంద్రంలో సూపరింటెండెంటు ప్రసాద్ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వాతంత్ర‌ దినోత్సవ వేడుకలలో విద్యార్ధులు దేశానికీ స్వాతంత్యం తెచ్చిపెట్టిన మహనీయుల వేషధారణలు వేసిన చిన్నారులు చూపరులను యంతగానో ఆకర్షించాయి. తరువాత జాతీయగీతాన్ని ఆలపించి విద్యార్ధులందరికీ చాక్లెట్లు,స్వీట్స్ పంచిపెట్టారు. ఈ కార్య‌క్ర‌మంలో అధికారులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *